Pariksha Pe Charcha: పరీక్షలంటే భయమా.. ప్రధాని మోదీతో ‘పరీక్షా పే చర్చ’కు డేట్ ఫిక్స్!
రాబోయేది పరీక్షల సమయం. ఏటా ప్రధాని మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చకు తేదీ ఖరారైంది. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టేందుకు ప్రధాని నేరుగా మాట్లాడి పలు కీలక సూచనలు చేయనున్నారు.
దిల్లీ: విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’(ParikshaPeCharcha2023)కార్యక్రమానికి తేదీ ఖరారైంది. ఈ నెల 27న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ప్రధాని ముఖాముఖి చర్చిస్తారని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం దిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరుగుతుందని పేర్కొంది. పరీక్షలు రాసే విద్యార్థులతో మోదీ మాట్లాడతారని తెలిపింది. ప్రధానితో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తొమ్మిది నుంచి 12 తరగతులు చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకొనేందుకు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 30వరకు అవకాశం కల్పించారు. MyGovలో పోటీల ద్వారా ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పీపీసీ కిట్లను బహుమతిగా అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తొలిసారి ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 16న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా మోదీ విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని, ఒత్తిడిని పోగొట్టి, పలు అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేస్తుంటారు.
Thanks for reading Pariksha Pe Charcha: Date fixed for 'Pariksha Pe Charcha' with Prime Minister Modi
No comments:
Post a Comment