Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, August 23, 2024

krishna astami : Do you know in which year .. at what time .. when Sri Krishna was born ?


 Krishna Astami : శ్రీకృష్టుడు ఏ సంవత్సరంలో .. ఏ టైంకి.. ఎప్పుడు జన్మించాడో తెలుసా.

శ్రీకృష్ణుడు అంటేనే ముందుగా ఆయన అష్టభార్యలు, 16వేల మంది గోపికలు గుర్తుకు వస్తారు. అలాగే శ్రీకృష్ణుడ్ని శృంగార రూపంగా భావిస్తారు. ఏ అవతార పురుషునికీ లేనన్నీ భార్యలు శ్రీకృష్ణుడికి ఉంటారు.

అయితే శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ.. ఏ సమయంలో జన్మించాడు.. . ఆయన జీవితంలో ఎంతమందిని సంహరించాడు.. ఆయన విధ్యాభ్యాసం ఏ వయస్సులో జరిగింది. ఆయనను ఏ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారు.. ఆయన జీవిత చరిత్ర విషయాల గురించి తెలుసుకుందాం. . . .

శ్రీకృష్ణుడు 5 వేల 255 సంవత్సరాల క్రితం జన్మించాడు.

పుట్టిన తేది: క్రీ. పూ. 18.07.3228 (3228 B.C)

మాసం: శ్రావణం

తిథి: అష్టమి

నక్షత్రం: రోహిణి

వారం: బుధవారం

సమయం: రాత్రి గం.00.00 ( అంటే సరిగ్గా రాత్రి 12 గంటలు)

జీవిత కాలం: 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు

నిర్యాణం: క్రీ పూ 18.02.3102(3102 B.C)

శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది.

కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం.

కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది.

క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.

భీష్ముడు క్రీ.పూ. 02.02.3138 న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.

శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు.

మధురలో... కన్నయ్య

ఒడిశాలో... జగన్నాధ్

మహారాష్ట్ర లో ...విఠల (విఠోబ)

రాజస్తాన్ లో.... శ్రీనాధుడు

గుజరాత్ లో ....ద్వారకాదీసుడు మరియు రాంచ్చోడ్

ఉడిపి, కర్ణాటకలో ....కృష్ణ

జన్మనిచ్చిన తండ్రి.. వసుదేవుడు

జన్మనిచ్చిన తల్లి ..దేవకీ

పెంచిన తండ్రి ...నందుడు

పెంచిన తల్లి ...యశోద

సోదరుడు .....బలరాముడు

సోదరి ....సుభద్ర

జన్మ స్థలం.... మధుర

భార్యలు: రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ.

శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం.

చాణుర ...కుస్తీదారు

కంసుడు ...మేనమామ

శిశుపాలుడు మరియు దంతవక్ర ...అత్త కొడుకులు

శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం

తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు.నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది.

14 నుంచి 16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14నుంచి 16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు. కాలయవన అను సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.

ఇంకా మరికొన్ని విషయాలు

శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16- నుంచి 18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.

పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి ...రాజ్యమును స్థాపించాడు...ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను...రాజ్యము నుండి వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను. ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను. గాంధారీ శాపం వలన అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించాడరి స్కంధ పురాణం ద్వారా తెలుస్తోంది

శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనిని... ఎవరికీ అంకితమవ్వలేదు. అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణగా నిలిచి పోతుంది.. . . .. . . .

Thanks for reading krishna astami : Do you know in which year .. at what time .. when Sri Krishna was born ?

No comments:

Post a Comment