భారతీయ పోస్టల్శాఖ దేశ వ్యాప్తంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలను అమలులోకి తెచ్చింది.
★ బెంగళూరు జనరల్ పోస్ట్ ఆఫీస్ (జీపీఓ) చీఫ్ పోస్ట్మాస్టర్ కె.రాధా కృష్ణ ఈ మేరకు ప్రకటన విడుదల.
★ బ్యాంకు ఖాతా తెరిచేందుకు, నగదు డ్రా చేసేందుకు ఇకపై ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరం లేదు. పోస్టల్శాఖ ప్రారంభించిన ఈ ప్రత్యేక పోస్టల్ బ్యాంకు సేవలను వినియోగించుకోవచ్చు.
★ ఈ ఖాతాలలో పొదుపు చేసిన మొత్తాలకు వందశాతం సురక్షిత ఉంటుందని రాధాకృష్ణ వెల్లడి.
ఈ ఖాతాలన్నీ జీరో బ్యాలెన్స్ ఖాతాలుగా ఉంటాయన్నారు.
★ పోస్టల్ సిబ్బందికి ఆర్ఐసిటి డివైజ్ యంత్రాలను ఇవ్వడం జరుగుతుందని వీటి ద్వారా పోస్టల్ శాఖకు సంబంధించిన పొదుపు ఖాతాలను, రికరింగ్ డిపాజిట్లను చేసుకోవచ్చునన్నారు.
★ పోస్టల్ సిబ్బందికి ఒక మొబైల్ కూడా ఇస్తున్నామని సంతకం ద్వారా ఖాతా వివరాలను అత్యంత సులభంగా నిర్వహించే వెసలుబాటు కల్పిస్తున్నామన్నారు
Thanks for reading Postal bank
No comments:
Post a Comment