మేము మీ బడికి వస్తాం..!
- జ్ఞాన నముపార్జనే లక్ష్యంగా ట్విన్నింగ్ స్కూల్స్"
- ఒక పాఠశాల విద్యార్థులుమరో పాఠశాలకు
- ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలభాగస్వామ్యం
- కార్యాచరణ సిద్ధం చేసిన SSA
పాఠశాల విద్యను బలోపేతం చేయడం, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పని చేస్తోంది. అందరికీ నమాన జ్ఞానం లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల ల భాగస్వామ్యం, ఉపాధ్యాయుల పరస్పర మార్పిడికి శ్రీకారం చుడుతూ ట్విన్నింగ్ స్కూల్ (భాగస్వామ్య పాఠశాలలు) పేరిట ప్రభుత్వం క్రేతస్థాయిలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇందులో గ్రామీణ, పట్టణ, నగర పాఠశాలల మధ్య పరస్పర భాగ
స్వామ్యంతో పాటు విద్యార్థులు కూడా ఒక పాఠశాల నుంచి మరోపాఠశాలకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. ఏడాది పొడువునా ట్విన్నింగ్ న్మూల్స్ కార్యక్రమం జిల్లాల లో అమలు జరుగుతుంది.
స్కూళ్ల ఎంపిక ఇలా
- ట్విన్నింగ్ స్కూల్స్ కార్యక్రమానికి గ్రామీణ పట్టణ, నగర ప్రాంతాల నుంచి రెండుపాఠశాలలను ఎంపిక చేస్తున్నారు.
- మౌలిక, ఆధునిక వసతులు, ఆటస్థలం క్రీడాపరికరాలున్న పాఠశాలలను ఎంపిక చేస్తారు.
- బహుముఖ పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్న టీచర్లను గుర్తిస్తారు, ప్రయాణ సదుపాయం ఉండాలి.
- విద్యార్థుల్లో ఉత్సాహం,ఆరోగ్యం తెలివిగల వారికి ప్రాధాన్యం ఇస్తారు.
- వేరే పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బంది లేని వారిని గుర్తించి,తల్లిదండ్రులతో సంప్రదించిన తరువాతే వెళ్లాలి.
జిల్లాస్థాయిలో పర్యవేక్షణ పాఠశాల స్థాయిలోని స్నేహబంధ, పరస్పర సహకారం, అనుబంధాల ప్రాముఖ్యతను చాటిచెబుతూ సత్పవర్తనతో విద్యను కొనసాగించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం అమలు చేస్తోంది. దీన్ని పర్యవేక్షించి, విజయవంతం చేసేందుకు సర్వశిక్ష అభియాన్, విద్యాశాఖ అధికారుల బృందం ప్రణాళికలు రూపొందించారు.ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులలో పరస్పరo మంచి గుణం ఏర్పడుతుంది. వారు కలిసిమెలసి విద్యను అభ్యసిస్తారు. జ్ఞానం, భావవ్యక్తీకరణ, సోదరభావం అలవరుచుకుంటారు, ఈ కార్యక్రమం విజయవంతానికి ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీలు సహకరించాలి.
జిల్లాలో జ్ఞానమార్పిడి కార్యక్రమాలకు ఆనువైన పాఠశాలలను ఎంపిక చేసేందుకు నిర్ణీత విధివిధానాలను SSA ప్రకటించింది. ప్రాథమిక స్థాయిలో 4,5 తరగతుల విద్యార్థులకు, ప్రాథమికోన్నతస్థాయిలో 6,7,8 తరగతుల విద్యార్థులకు ట్విన్నింగ్ స్కూల్స్ కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు. కేంద్ర మానవరుల ఆభివృద్ధి
శాఖ ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే ఆమోదం కూడా తెలిపింది. ట్విన్నింగ్ స్కూల్స్ కార్యక్రమానికి సంబంధించి పాఠశాలల ఎంపికకు కొన్ని ప్రమాణాలను నిర్దేశించారు వాటి ప్రాతిపదికగా పాఠశాలలను ఎంపికచేపడుతున్నారు. గుణాత్మక విద్య, బోధనా విధానాలు ప్రాజెక్టులు, స్టడీటూర్స్, ఎక్స్ఫోజర్ విజిట్స్, సైన్సు ఫెయిర్స్, అర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, sports and games, కల్చ రల్, లిటరరీ, స్వచ్ఛందసేవ, స్కూల్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్
సిస్టం, పేరెంట్స్ కమిటీలు, టీచర్ కౌన్సిల్స్ లాంటి అంశాలను బేరీజు వేసుకుని ఆయాపాఠశాలల మధ్య టీచర్లు, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు వారం రోజుల పాటు ఉంటాయి, రాష్ట్ర జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలలను ఎంపికచేస్తున్నారు
ఆతిధ్యం ఇవ్వనున్న పేరెంట్స్ కమిటీలు
మన ఇంటికి చుట్టాలు లేదా స్నేహితులు వస్తే ఏ విధంగాఆహ్వానించి ఆతిథ్యం ఇస్తారో అదే రీతిన పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించేలా పేరెంట్స్ కమిటీలు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం సుూచించింది.
వసతి, తాగునీరు, భోజనం అవసరమైతే వైద్యసదు
పాయాలు కూడా ఏర్పాటు చేసి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేలా కమిటీలు చూడాలి. ఆతిథ్యం ఇచ్చే పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారు సాధించిన విజయాలు, అందుకు దోహద పడిన అంశాలు, వారి మార్గనిర్దేశాలను వివరించడం ద్వారా విద్యార్థులు సర్వతోముఖాధివృద్ధి చెందుతారు.
Thanks for reading school partnership programme -TWINNING of schools- Implementation guidelines-
No comments:
Post a Comment