టీచర్ల నియామకానికి సంబంధించి 2018 డీఎస్సీ నియామకాలు పూర్తి అయిన తరువాతే కొత్తగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)ల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.
► 2018 డీఎస్సీ విషయంలో న్యాయ వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త టెట్, డీఎస్సీ నిర్వహించే పరిస్థితి లేదు.
కరోనా , లాక్డౌన్ వంటి ప్రస్తుత పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు.
► 2018 డీఎస్సీ వివాదాలు పూర్తిగా సమసిపోయి, నియామకాలు పూర్తయ్యాకే కొత్త టెట్, డీఎస్సీలపై నిర్ణయం.
► న్యాయ వివాదాలపై ప్రభుత్వ వాదనలను సమర్థంగా వినిపించి, అర్హత సాధించిన అభ్యర్ధులకు న్యాయం చేస్తాం. ఎస్జీటీ, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, పీఈటీల పోస్టులపై కోర్టులో వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి.
► హిందీ, తెలుగు పండిట్ పోస్టుల వ్యాజ్యాలు క్లియర్ అయ్యాయి. వీటికి ఈ నెలాఖరుకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నాం అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ డిఎస్సి-2020 సమాచారం
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ నిర్వహణ కు సంబంధించి టెట్ మరియు డిఎస్సిలను వేరువేరుగా నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఈసారి టెట్-3 ని ఆన్లైన్ లో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. ప్రస్తుతం కోవిడ్ -19 వ్యాప్తి నియంత్రణ కొరకు లక్డౌన్ కొనసాగుతుండడం తో నిర్ణయ తేదీలను ప్రకటించకుండానే నిర్వహణ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 9000 పైచిలుకు పోస్టులతో ఎపి డిఎస్సి -2020 ని నిర్వహించే అవకాశం వుంది. ఎపి డిఎస్సి 2020 కి సంబంధించి సుమారు 3000 పోస్టులు వరకు ఎస్ఏ లు, పీజీటీ, టీజీటీ లు 300 వరకు, ఎస్జీటీ లు 5000 పైగా ఖాళీలు వున్నాయి. ఈ సారి ఎస్జీటీ పోస్టులు ఎక్కువ వుండే అవకాశం వుంది.
ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి-2020 కి సంబంధించి జిల్లా అధికారులు విద్యాశాఖకు తెలియజేసిన ఉపాధ్యాయ ఖాళీల వివరాలు
శ్రీకాకుళం :550
విజయనగరం :471
విశాఖ పట్నం :549
తూర్పు గోదావరి :2097
పశ్చిమ గోదావరి:507
కృష్ణ : 600
గుంటూరు :520
నెల్లూరు :575
అనంతపురం :471
కడప :543
కర్నూలు :1546
అయితే చిత్తూరు, మరియు ప్రకాశం జిల్లా ఉపాధ్యాయ ఖాళీల వివరాలు లెక్క తెలియాల్సి వుంది.
గమనిక: ప్రభుత్వం ఖాళీలపై సమాచారం ప్రకటించవలసి ఉన్నది.
Thanks for reading DSC-2020 సమాచారం
No comments:
Post a Comment