Teachers Transfers:ప్రభుత్వ పరిశీలనలో టీచర్ల బదిలీలు
కరోనా వైరస్ నేప ధ్యంలో పాఠశాలలు మూసివేసిన ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలను పరిశీలిస్తుంది.
2017 తర్వాత ఇప్పటివరకు ఉపాధ్యాయుల బదిలీలు జరగలేదు. వీటికోసం అన్ని ఉపా ధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఏడాది లాక్డౌన్ నేప థ్యంలో పాఠశాలల పునఃప్రారంభం మరింత ఆలస్యం అవుతుంది.
దీంతో పాఠశాలలు ప్రారంభం నాటికి బదిలీలను వెబ్ కౌన్సెలింగ్ విదానంలో ఆన్లైన్ ద్వారా నిర్వహిం చాలని ప్రభుత్వం యోచిస్తుంది.గతంలో ఒకసారి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయుల బది లీలు నిర్వహించారు. ఆన్లైన్లో బదిలీ కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వచ్చే ఎంటైటిల్ మెంట్ పాయింట్లు కేటాయించి వారు స్థానాల కోసం పెట్టిన ఆష్షన్లులో ఒక స్థానాన్ని కేటాయిస్తారు. బదిలీ ఉత్తర్వులను ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసుకొని కొత్త పాఠశాలల్లో చేరేందుకు అవకాశం ఉంది. పాఠశాల విద్య కమిషనర్ చినవీరభద్రుడు ఆన్లైన్లో ఉపాధ్యాయుల బదిలీల నిర్వహ ణపై సూచనలు ఇవ్వాలని సోమవారం డీఈ వోలను కోరారు. వీరి నుంచి సూచనలు అందిన తర్వాత ప్రభుత్వం ఉన్నతస్తాయి అధికారులతో చర్చించి బదిలీలపై తుది నిర్ణయం తీసుకుంటుంది.
Thanks for reading Teachers Transfers:ప్రభుత్వ పరిశీలనలో టీచర్ల బదిలీలు
No comments:
Post a Comment