వైఎస్సార్ కాపు నేస్తం వర్తించేందుకు అర్హతలు... (Eligibility For YSR Kapu Nestham)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. కరోనా సంక్షోభం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనకడుగు వేయకుండా ఏపీ సర్కార్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే కాపు మహిళల అభ్యున్నతి కోసం 'వైఎస్సార్ కాపు నేస్తం'(YSR Kapu Nestham Scheme) పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) జూన్ 24న తన క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
కాపు మహిళలకు అండగా నిలిచేందుకు 'వైఎస్సార్ కాపు నేస్తం' (YSR Kapu Nestham) పథకాన్ని రూపొందించారు.
ఈ పథకంలో అర్హులైన కాపు ఉప కులాలైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున అయిదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని చేస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2,35,873 లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. సుమారు రూ.354 కోట్లను నేరుగా కాపు మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయనున్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఒక్క బటన్ నొక్కడం ద్వారా అర్హులైన మహిళలందరి ఖాతాల్లో రూ.15 వేలు జమ అవుతాయి.
వైఎస్సార్ కాపు నేస్తం వర్తించేందుకు అర్హతలు... (Eligibility For YSR Kapu Nestham)
- కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మించకూడదు.
- ఆ కుటుంబానికి 3 ఎకరాలలోపు తరి లేదా 10 ఎకరాల మెట్ట (ఖుష్కి) భూమి ఉండాలి. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి.
- అదే పట్టణ ప్రాంతాల వారికి అయితే ఎలాంటి ఆస్తి లేదా 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు, ఇతర ఏ నిర్మాణాలు ఉండకూడదు.
- ఆ కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. అలాగే ప్రభుత్వ పెన్షన్ కూడా పొందరాదు.
- ఆ కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. అయితే ఆటో, టాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు ఉండనుంది.
- ఆ కుటుంబంలో ఎవరూ కూడా పన్ను చెల్లింపుదారులై ఉండకూడదు
Thanks for reading వైఎస్సార్ కాపు నేస్తం వర్తించేందుకు అర్హతలు... (Eligibility For YSR Kapu Nestham)
No comments:
Post a Comment