New pensions from July
పది రోజుల్లోనే పింఛను!!
🍁కొత్త మార్గదర్శకాల మేరకు కసరత్తు
🔸జులై నెల నుంచి కొత్త పింఛన్లు
🔸దరఖాస్తు చేసిన పది రోజుల్లోనే ‘వైఎస్ఆర్ పింఛను కానుక’ను మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు నిబంధనలు వెలువరించటంతో సచివాలయ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
🔹వార్డు, గ్రామ వాలంటీర్లకు దరఖాస్తులు అందించినా చాలు. వారే వాటిని అప్లోడ్ చేయిస్తారు. అర్జీలన్నీ సచివాలయాల్లోని డిజిటల్ సహాయకులు ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తారు.
🔹సంబంధిత పత్రంతో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల అర్హతను పరిశీలిస్తారు.
🔸సంక్షేమ సహాయకులు (వెల్ఫేర్ అసిస్టెంట్లు) సమ్మతించాక ఎమ్పీడీవోలు, కమిషనర్ల లాగిన్లకు చేరతాయి.
🔹వీరు అర్హులను గుర్తిస్తే మంజూరుకు ఆన్లైన్లో సెర్ప్(గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ)కు ప్రతిపాదిస్తారు. అనర్హులుగా తేలితే వెంటనే అక్కడే తిరస్కరణ జాబితాలో చేరుస్తారు
🍁ఎప్పటికప్పుడు పరిశీలన
🔸కొత్త నిబంధనల ప్రకారం ప్రతి నెలా 20వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి అర్హులైతే తరువాత నెలలో పింఛను సొమ్ములు అందించాలి. ఈ మేరకు సమయ పట్టిక సైతం ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో జాప్యం జరిగితే అధికారులనే బాధ్యులను చేసేందుకు సమాయత్తమవుతోంది.
Check your YSR Pension status ...Click here
Check your YSR Pension status ...Click here
Also read.....
Thanks for reading New pensions from July
No comments:
Post a Comment