An exercise undertaken by the Department of Education of teachers transfers coming to an end.
టీచర్ల బదిలీలు ఖాయం....చివరిఅంకానికి వస్తున్న విద్యాశాఖ చేపట్టిన కసరత్తు
వారం రోజుల్లోగా ఉత్తర్వులు
🍁కమిషనరేట్లో ప్రత్యేకంగా విభాగం
🍁ఇప్పటికే ఖాళీలను గుర్తించిన డీఈఓలు
🍁సర్దుబాటుపైనా స్పష్టత వచ్చే అవకాశం
❇️అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ,జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో ఉపాధ్యాయల బదిలీల అంశంపై విద్యాశాఖ చేపట్టిన కసరత్తు చివరిఅంకానికి చేరుకుంది.
❇️ఇప్పటికే జిల్లాలవారీగా డీఈఓలుఖాళీలతోపాటు లాంగ్ స్టాండింగ్ వివరాలను పాఠశాల విద్యాశాఖకు పంపించారు. ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో డీఈఓలు పలు అనుమానాలను లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో బదిలీలు, సర్దుబాటుపై అనుమానాల
నివృత్తి చేయడంతోపాటు అన్నింటిని ఆన్లైన్ చేసేందుకు విద్యాశాఖ కమిషనరేట్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
❇️పాఠశాల విద్య డైరెక్టర్ వాడ్రేవు చిన్నవీరభద్రుడుఆదేశాల మేరకు ఎన్సీఈఆర్టీ ఐటీ సెల్ కు చెందిన సీహెవీ రమేష్ కుమార్, డైరెక్టరేట్ లోని జూనియర్ అసిస్టెంట్ టీ శ్రీహరిని ఆ విభాగంలో నియమించారు.
Thanks for reading An exercise undertaken by the Department of Education of teachers transfers coming to an end
No comments:
Post a Comment