పాఠశాల విద్యా కమిషనర్ వారు ఉపాధ్యాయ సంఘాలతో రేషనలైజేషన్,బదిలీల్లో గురించి జరిగిన చర్చలు వివరాలు.
తేదీ 16/10/2020 ఉదయం పాఠశాల విద్యా కమిషనర్ వారు ఉపాధ్యాయ సంఘాలతో రేషనలైజేషన్,బదిలీల్లో లేవనెత్తిన అంశాలపై చర్చ జరిపారు.
ప్రధానంగా కింది సమస్యలు చర్చకు వచ్చాయి:
1) ప్రాథమిక పాఠశాలల రేషనలైజేషన్ విషయం లో ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
2) SGT లకు WEB Counseling కాకుండా Online Counseling జరపాలనే ప్రతిపాదనకు సానుకూలం.
3) వేకెన్సీలు బ్లాక్ చేయకుండా అన్నీ ఓపెన్ చేయడాని సానుకూలత వచ్చింది.
4) 2019 జూస్ నుండి పదోన్నతులు, అప్ గ్రేడేషన్ ద్వారా నింపిన అన్నింటినీ ఖాళీలుగా చూపాలనే డిమాండ్ ప్రభుత్వానికి తెలుపుతామున్నారు.
5) పదోన్నతులు ముందు కల్పించినా నష్టం జరగకుండా చూస్తామన్నారు.
6) పదవీ విరమణ కు 3 ఏళ్ళ లోపు సర్వీసు ఉన్న వారిని పరిగణలోకి తీసుకోవడానికి అంగీకరించారు.
7) థర్డ్ మెథడాజీ వారికి పదోన్నతుల్లో అవకాశం కల్పించారు. జీవో రాబోతుంది. ఎం ఏ తెలుగు విషయం కోర్టు లో ఉన్నందున వారి సమస్య పరిష్కారం కాలేదు.
8) సర్వీస్ పాయింట్లు 1 గా మార్చడానికి సానుకూలంగా స్పందించలేదు.పై అంశాలపై కమీషనర్ వారు సానుకూలంగా స్పందించి నందున గత 5 రోజులు నుండి నిర్వహిస్తున్న రిలేనిరాహారదీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఫ్యాప్టో కార్యవర్గం తీర్మానించి నందున ఈ నిర్ణయం మీరు మీమీ జిల్లాల్లో ప్రకటించాల్సి ఉంది గా కోరుతున్నాము. ముఖ్యమైన అంశాలు పరిష్కారం కాని పక్షంలో తదుపరి పోరాటానికిసద్ధంగా ఉండాలని కోరుతున్నాము.
Thanks for reading The school education commissioner details the discussions they had with the teacher unions about rationalization and transfers
No comments:
Post a Comment