49 ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ -
●జేఎన్టీయూకే పరిధిలో 26 .. జేఎన్టీయూఏలో 23 కాలేజీలు
● 25 % కన్నా తక్కువ అడ్మిషన్లు ఉండటమే ప్రధాన కారణం -
●మౌలిక సదుపాయాలు లేని మరో 64 కాలేజీల్లో సీట్లకు కోత
●ఈసీల ఆమోదంతో సర్కారుకు జాబితాలు పంపిన వర్సిటీలు
అమరావతి , నవంబరు 10 : కనీసం 25 శాతమైనా అడ్మిషన్లు లేని ఇంజనీరింగ్ కాలేజీల కథ కంచికి చేరనుంది . రాష్ట్రంలో ఇలాంటి 49 ఇంజనీ రింగ్ కాలేజీలు మూతపడనున్నాయి . ఇందులో జేఎ టీయూకే పరిధిలో 26 , జేఎన్టీయూఏ పరిధిలో 23 కాలేజీలు ఉన్నాయి . కొన్ని సంవత్సరాలుగా 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు కలిగి ఉండటం , జీరో అడ్మిషన్ల కారణంగా ఆయా ఇంజనీరింగ్ కాలేజీల మూతకు ఈ రెండు విశ్వవిద్యాలయాలు ప్రభుత్వా నికి ప్రతిపాదించాయి . ఈ మేరకు పాలక మండళ్ల ( ఈసీ ) ఆమోదముద్ర వేయించుకుని ఆ కాలేజీల జాబితాను ఉన్నత విద్యా మండలికి , ఉన్నత విద్యాశా ఖకు పంపించాయి . దీంతో ఆయా కాలేజీలను 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మి షన్ల కౌన్సెలింగ్ జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది . ఈ 49 కాలేజీలు మూతపడితే వెబ్ కౌన్సెలింగ్ లో దాదాపు 12 వేల వరకు సీట్లు కనిపించవు . అలాగే ఏఐసీటీఈ నిబంధ నల మేరకు మౌలిక సదుపాయాలు లేవన్న కార ణంగా మరో 64 ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లను తగ్గించాలని కూడా ఆ వర్సిటీలు నిర్ణయించాయి . జేఎన్ టీయూకే తన పరిధిలోని 47 కాలేజీల్లో 4,812 సీట్లు తగ్గించింది . అలాగే జేఎన్టీయూఏ మూతకు ప్రతిపాదించిన 28 కాలేజీలు , సీట్లు తగ్గించిన 17 కాలేజీల్లో కలిపి దాదాపు 5,100 సీట్లు తగ్గించనుంది . ఉన్నత విద్య నియంత్రణ , పర్యవేక్షణ కమిషన్ కొన్ని నెలల క్రితం జీరో అడ్మిషన్లు , మౌలిక సదుపాయాలు లేని కాలేజీలు , ఆదాయ వ్యయాల లెక్కల్లో తేడాలు న్నట్లు గుర్తించిన కాలేజీల జాబితాను జేఎన్టీ యూకే , జేఎన్టీయూఏలకు పంపించి , తనిఖీలు చేసి నివేదించమని ఆదేశించింది . దీంతో ఆయా వర్సిటీలు నిజనిర్ధారణ కమిటీలను ఏర్పాటుచేసి భౌతిక తని ఖీలు చేయిర్బాచాయి . ఆ తర్వాత కాలేజీలు సమర్పిం చిన సమాచారంతో సరి చూశాయి . అన్నీ పరిశీలిం చిన అనంతరం కాలేజీల మూత , సీట్ల తగ్గింపు ప్రతి పాదనలను ప్రభుత్వానికి పంపించాయి . స్వచ్చం దంగా మూతకు లేఖలు ఇచ్చిన కాలేజీలతో పాటు వర్సిటీలు ప్రతిపాదించిన కాలేజీలకు రెగ్యులేటరీ కమిషన్ ఫీజులు సిఫారసు చేయదు . మిగిలిన కాలే జీలకు మాత్రమే 2020-21 విద్యా సంవత్సరానికి ఫీజులు సిఫారసు చేస్తుంది . వాస్తవానికి ఫీజులపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన కమిషన్ .. సర్కారు ఉత్తర్వులు రాగానే కొత్త ఫీజులను ప్రభుత్వానికి సిఫారసు చేయనుందని సమాచారం . రెండు , మూడు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయ నుందని తెలిసింది .
Thanks for reading 49 Engineering Colleges Closed
No comments:
Post a Comment