NMMS రెన్యువలకు నవంబర్ 30 వరకు గడువు పొడిగింపు
ఎడ్యుకేషన్ : గతేడాది జరిగిన జాతీయ ప్రతిభా ఉపకార వేతన ( NMMS ) పరీక్షలో ఎంపికైన విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేసుకునేందుకు తుది గడువు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ఎస్ గంగాభవానీ మంగళవారం తెలిపారు . 2016 , 2017 , 2018 సంవ త్సరాల్లో ఎంపికై న విద్యార్థులు సైతం తిరిగి రెన్యువల్ చేయించుకోవాలన్నారు . రెన్యువల్ చేయించుకోని విద్యార్థులకు ఉపకార వేతనం మంజూరు చేయామని స్పష్టం చేశారు . ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలపై ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారని పేర్కొన్నారు . పాఠశాల పరిధిలో విద్యా ర్థుల వివరాలను ఆమోదించుటకు డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించారని తెలిపారు . NMMS కు ఎంపికైన విద్యార్థులు http://www.scholarships.gov.in సైట్లో తమ వివ రాలను నమోదు చేసుకోవాలని సూచించారు .
ఫిబ్రవరి 14 న NMMS పరీక్ష
జాతీయ ప్రతిభా ఉపకార వేతన ( NMMS ) పరీక్ష ఫిబ్రవరి 14 వ తేదీన జరుగుతుందని ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు . డిసెంబర్ 9 వ తేదీలోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు . పరీక్ష రుసుంను డిసెంబర్ 10 లోపు చెల్లించాలని పేర్కొన్నారు . పూర్తి వివరాలకు www.bseap.org సైట్ చూడాలన్నారు . వివరాలకు ఆయా పాఠశాలల హెచ్ఎంలను సంప్రదించాలని చెప్పారు .
Thanks for reading Extension of deadline to November 30 for NMMS renewals.
No comments:
Post a Comment