AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:05.11.20
అమరావతి: ఏపీ ప్రభుత్వం కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 85,364 నమూనాలను పరీక్షించగా 2,745 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,35,953కి చేరింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ చికిత్స పొందుతూ 13 మంది మృతిచెందారు. కృష్ణా జిల్లాలో 3, చిత్తూరు 2, విశాఖపట్నం 2, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,757కి చేరింది. ఒక్కరోజులో 2,292 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 21,878 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 84,27,629 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.
Thanks for reading AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:05.11.20
No comments:
Post a Comment