AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:10.11.20
అమరావతి: ఏపీ ప్రభుత్వం కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 67,910 నమూనాలను పరీక్షించగా 1,836 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 8,46,245కి చేరింది. 24 గంటల్లో కొవిడ్ చికిత్స పొందుతూ 12 మంది మృతిచెందారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురేసి, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,814కి చేరింది. ఒక్కరోజులో 2,151 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 20,958 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 87,92,935 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.
Thanks for reading AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:10.11.20
No comments:
Post a Comment