AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:18.11.20
అమరావతి: ఏపీలో కొత్తగా 1,236 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 9 మంది మృత్యువాత పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తన బులెటిన్లో పేర్కొంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,57,395కి చేరింది. ఇప్పటి వరకు 6,899 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 1,696 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 8,33,980 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,513 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 69,618 కరోనా పరీక్షలు నిర్వహించగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 93,33,703 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు బులెటిన్లో తెలిపింది.
Thanks for reading AP Media bulletin: Details of today's Covid-19 cases@Date:18.11.20
No comments:
Post a Comment