యువతా మేలుకో .. భవిత మార్చుకో .
- * ఓటు నమోదు ప్రక్రియ ఆరంభం
- * అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ సిబ్బంది
- * ఆన్లైన్లోనూ డిసెంబర్ 15 వరకు
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం . ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేసుకో వాలి . ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారానే మంచి పాలనకు అవకాశం ఏర్పడుతుంది . ఓటు హక్కుకు యువత దూరమైతే ప్రజాస్వామ్యానికి సరైన న్యాయం జరగదు . స్థానిక సంస్థలకు ముందు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు . శనివారం నుంచి ఆరంభమైన కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగుతుంది . డిసెంబర్ 12 , 18 వ తేదీల్లోనూ ఈ ప్రత్యేక నమోదు కార్యక్రమం జరుగుతుంది . వచ్చే జనవరి 1 వ తేదీకి 18 ఏళ్లు నిండిన వారందరికి ఓటుహక్కు కల్పిస్తారు .
ఫారం -6 :కొత్తగా ఓటు నమోదుకు
ఫారం -6 ఏ :ప్రవాస భారతీయుల ఓటు నమోదుకు
ఫారం -7 :జాబితాలో నుంచి ఓట్ల తొలగింపునకు, డబుల్ఎట్రీలు,మృతులు , వలస వెళ్లిన వారి వివరాల తొలగింపునకు
ఫారం -8 :జాబితాలో నమోదైనవివరాల్లో తప్పులు
సరిచేసుకునేందుకు
ఫారం -8 ఏ:పోలింగ్ స్టేషన్ మార్పునకు ,ఒక చోట నుంచి మరో చోటకు మారితే.
నేరుగా వెళ్లి నమోదు ..
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్ వోలు హాజరై ఓటరు నమోదు , మార్పులు చేర్పులను చేపడ తారు . పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్వోలు , సచి వాలయాలు , తహసీల్దార్ కార్యాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారు . నేరుగా వెళ్లి ఫారం -6 అందించవచ్చు . ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు . ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో నూతన ఓటర్ల జాబితాలను పెట్టారు . వాటిలో పేర్లు ఉన్నాయో లేవో చూసుకుని .. వెంటనే నమోదు చేసుకోవచ్చు . అంతర్జాలంలోనూ చేసుకోవచ్చు .. డిసెంబర్ 15 వ తేదీలోపు ఓటరుగా ఆన్లైన్లో నమోదు చేసుకునేం దుకు గడువు ఉంది . గడువులోపు దాఖలైన వాటిని పరిశీలించి 2021 జన వరి 15 న తుది ఓటర్ల జాబితాలను ప్రచురిస్తామని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది .
* ఆన్లైన్ ఓటరుగా నమోదుకు అధికారిక వెబ్ సైట్లు : www.nvsp.in ...
* మరింత సమాచారానికి టోల్ ఫ్రీ నంబరు : 1950
Thanks for reading Beginning of the vote registration process
No comments:
Post a Comment