MCA Course Duration Reduced To 2 Years
ఎంసీఏ రెండేళ్లే
తాజా విద్యాసంవత్సరం నుంచి ఎంసీఏ రెండేళ్లు మాత్రమే ఉంటుంది. మూడేళ్లున్న ఈ కోర్సును రెండేళ్లకు పరిమితం చేస్తూ నిర్ణయించారు. శనివారం అనంత జేఎన్టీయూలో నిర్వహించిన అకడమిక్ సెనేట్ సమావేశంలో ఆమోదం లభించింది. రెండేళ్ల పాఠ్యాంశాల రూపకల్పనపైనా చర్చించారు. 2020-21 విద్యాసంవత్సరం నుంచే నూతన సిలబస్ను అందుబాటులోకి తీసుకొస్తారు. అలాగే బీటెక్లో 20 క్రెడిట్స్ అదనంగా పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్ డిగ్రీతో పాటు మైనర్స్, ఆనర్స్ డిగ్రీ ఇవ్వనున్నారు. డిజిటల్ లాకర్స్లో ఉంచేలా డిగ్రీ నమూనాను ఆమోదించారు. ఇంజినీరింగ్లో ప్రతి సబ్జెక్టుకు ఈ-పాఠ్యాంశాలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సచివాలయాల్లో సైతం ఈ-కంటెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటుపైనా చర్చించారు. కార్యక్రమంలో ఉపకులపతి శ్రీనివాస్కుమార్, రెక్టార్ భాస్కర్దేశాయ్, రిజిస్ట్రార్ విజయ్కుమార్, విద్యాప్రణాళిక సంచాలకులు సత్యనారాయణ పాల్గొన్నారు.
Thanks for reading MCA Course Duration Reduced To 2 Years
No comments:
Post a Comment