జనవరి నుంచి వీటి ధరలు ప్రియం
కొత్త సంవత్సరంలో టీవీలు, ఫ్రిడ్జ్ల వంటి గృహోపకరణాలు కొనాలనుకునే వారికి.. వాటి తయారీ సంస్థలు షాకివ్వనున్నాయి. జనవరి నుంచి వాటి ధరలు పెంచేందుకు దాదాపు అన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఎల్ఈడీ టీవీల ధరలు 10 శాతం మేర, ఆండ్రాయిడ్ టీవీల ధరలు 20 శాతం మేర పెంచేందుకు కంపెనీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
2021 జనవరి నుంచి ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి గృహోపకరణాల ధరలు జనవరి నుంచి దాదాపు 10శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. వీటి తయారీకి ముడిపదార్థాలైన కాపర్, అల్యూమినియం, స్టీల్, ప్లాస్టిక్ ధరల ప్రభావం వీటిపై పడనుంది. దీనితోపాటు నౌకారవాణా, విమానాల్లో కార్గో ధరల్లో పెరుగుదల కూడా ధరల పెరుగుదలకు కారణయ్యే అవకాశముంది. ఇవే కాకుండా సరఫరా తగ్గడం వల్ల టీవీ ప్యానల్ (ఓపెన్ సెల్) ధరలు రెండింతలయ్యాయి. దీనితో ఎల్జీ, పానాసోనిక్, థామ్సన్ జనవరి నుంచి ధరలు పెంచనున్నాయి. సోనీ.. ధరల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ముడిసరకుల ధరలు పెరుగుతాయని భావిస్తున్నాం. అవి మా ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపిస్తాయి. నా అంచనా ప్రకారం జనవరిలో దాదాపు 7శాతం ధరలు పెరగవచ్చు. తొలి త్రైమాసికంలోపు ఇవి 11శాతం వరకు చేరవచ్చు" అని పానాసోనిక్ ఇండియా సీఈఓ మనీష్ శర్మ పేర్కొన్నారు.జనవరి 1 నుంచి ఎల్జీ ఇండియా కూడా దాదాపు 8 శాతం ధరలను పెంచనుంది. 'జనవరి నుంచి మేము ధరలను అన్ని ఉత్పత్తులపై 8 శాతం వరకు పెంచుతున్నాం. కాపర్, అల్యూమినియం వంటి వాటి ధరల్లో పెరుగుదల ఉంది' అని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం అప్లయన్సెన్స్ వైస్ప్రెసిడెంట్ విజయ్బాబు తెలిపారు. సోనీ ఇండియా మాత్రం వేచిచూసే ధోరణ అవలంబిస్తుందని సంస్థ భారతీయ విభాగం ఎండీ సునీల్ నయ్యర్ అన్నారు.టీవీల్లో వినియోగించే ప్యానల్ ధరలు 200శాతం పెరిగాయి. ముఖ్యంగా వీటి సరఫరా గణనీయంగా తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణం. ఈ ప్యానళ్ల తయారీకి ప్రపంచవ్యాప్తంగా సరైన ప్రత్యామ్నాయం లేదు. ఇవి అత్యధికంగా చైనాలో మాత్రమే తయారవుతాయి. అందుకే థామ్సన్, కొడాక్ సంస్థలు ఆండ్రాయిడ్ టీవీ ధరలను జనవరి నుంచి భారీగా 20 శాతం పెంచనున్నాయి.
Thanks for reading These prices will go up from January
No comments:
Post a Comment