నాడు - నేడు .. నాణ్యత విషయంలో రాజీపడొద్దు : సీఎం జగన్
'నాడు-నేడు' కార్యక్రమంలో భాగంగా చేపట్టే పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దని సీఎం జగన్ స్పష్టం చేశారు. గోరుముద్ద, మధ్యాహ్న భోజనం పక్కాగా అమలుచేయాలని ఆదేశించారు. మనబడి నాడు-నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పాఠశాలల ప్రారంభం, విద్యార్థుల హాజరుపై ముఖ్యమంత్రి వివరాలు కోరారు.
మనబడి నాడు - నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రెండోవిడత నాడు - నేడు పనులకు సిద్ధం కావాలని అధికారులకు సూచించారు. పనుల నాణ్యతలో రాజీపడవద్దని అధికారులను సీఎం ఆదేశించారు. ఏప్రిల్ 15 నుంచి రెండోవిడత నాడు - నేడు ప్రారంభిస్తామని అధికారులు సీఎంకు చెప్పారు. డిసెంబరు 31లోగా పనులు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వివరించారు. రెండోవిడత నాడు - నేడు పనులకు రూ.4,446 కోట్లు అవుతాయని అంచనా వేశారు.
పాఠశాలల ప్రారంభం, విద్యార్థుల హాజరుపై సీఎం జగన్ వివరాలు కోరారు. విద్యార్థులు బడికి రాకుంటే తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ వెళ్లాలన్న ముఖ్యమంత్రి.. గోరుముద్ద, మధ్యాహ్న భోజనం పక్కాగా అమలుచేయాలని ఆదేశించారు. టాయిలెట్ల నిర్వహణకు సులభ్ ఇంటర్నేషనల్తో ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలిపిన సీఎం.. టాయిలెట్ల నిర్వహణకు 49 వేల మంది సిబ్బంది అవసరమవుతారని చెప్పారు. టాయిలెట్ నిర్వహణ సిబ్బందికి సులభ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందని తెలిపారు.
Thanks for reading Nadu -Nedu .. Do not compromise on quality: CM Jagan


No comments:
Post a Comment