ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
అమరావతి: ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. అమరావతి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 పేపర్లుగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.
కొవిడ్ కారణంగా కోల్పోయిన కాలాన్ని గాడిలో పెట్టేందుకు దశల వారీగా తరగతులు మొదలుపెట్టామని మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి అన్ని పాఠశాలలు యథాతథంగా పనిచేస్తున్నాయన్నారు. జూన్ 5 వరకు తరగతులు కొనసాగుతాయని వివరించారు. మే 3 నుంచి 15 వరకు 1-9 తరగతులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జులై 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆదిమూలపు సురేశ్ చెప్పారు..
Thanks for reading AP Tenth Class Exam Schedule Release
No comments:
Post a Comment