Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, March 27, 2021

Changes from April 1 : ఏప్రిల్ 1 నుంచి ఇవి ఇక చెల్లవు


 Changes from April 1 : ఏప్రిల్ 1 నుంచి ఇవి ఇక చెల్లవు .. మీరేం చేయాలో తెలుసా ...

ఆర్థిక సంవత్సరం ప్రారంభవుతుందనే ఆర్థిక వ్యవస్థలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టారులో ఆర్థిక పరమైన మార్పులు తప్పనిసరిగా ఉంటాయి. గతంలో నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వ రంగం బ్యాంకుల్లో విలీనం చేశాయి. ఈ ప్రక్రియ 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 ఏప్రిల్ 1 వరకు కొనసాగింది. వీటిలో దేనాబ్యాంక్, విజయా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్లు ఉన్నాయి. ఈ బ్యాంకులు విలీనమైనప్పటికీ వాటి పాస్ బుక్స్, చెక్స్ బుక్స్ మాత్రం చెల్లుబాటవుతూ వచ్చాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం(2021-22) నుంచి ఈ విధానం మారనుంది.ఏప్రిల్ 1 నుంచి ఈ బ్యాంకుల చెక్ బుక్ లు, పాస్ బుక్ లు చెల్లుబాటు కావు. ఈ ఏడు బ్యాంకుల చెక్ బుక్ నిలిపివేయడం అనేది ఆయా బ్యాంక్ వినియోగదారుల బ్యాంకింగ్ అవసరాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. అందువల్ల ఈ ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఎందులోనైనా మీకు ఖాతా ఉన్నట్లయితే ఈ విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. బ్యాంకుల విలీనంలో భాగంగా.. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ లు బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనం అయ్యాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బీ)లో విలీనం అయ్యాయి. కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి.

కస్టమర్ల మొబైళ్లకు సమాచారం..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అయిన ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్ లు తమ ఖాతాదారులకు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ వారి మొబైల్ నెంబర్లకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ బ్యాంకులకు సంబంధించిన చెక్ బుక్ లతో పాటు ఐఎఫ్ఎస్సీ, ఎంఐసిఆర్ కోడ్ శాఖలు తదితర వివరాలు మారిపోనున్నాయి. అదేవిధంగా, ఇతర బ్యాంకుల్లో విలీనమైన కస్టమర్లు సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి మారిన MICR కోడ్, IFSC కోడ్, చెక్ బుక్, పాస్ బుక్ మొదలైనవి పొందాల్సి ఉంటుంది. అయితే సిండికేట్ బ్యాంక్ మాత్రం ఈ విషయంలో కాస్త ఊరటనిచ్చింది. సిండికేట్ బ్యాంక్ ను కెనరా బ్యాంకులో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇతర బ్యాంకుల్లా కాకుండా ఈ బ్యాంకు కస్టమర్లు తమ పాస్ బుక్ లావాదేవీలను జూన్ 30 వరకు జరుపుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం వారు ఉపయోగించే MICR కోడ్, IFSC కోడ్, చెక్ బుక్, పాస్ బుక్ మొదలైనవి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని కెనరా బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ వివరాలు పొందిన తర్వాత బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ తమ బ్యాంక్ అకౌంట్ వివరాలను మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ అకౌంట్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీలు, ఇన్ కం ట్యాక్స్, ఎఫ్ డీ, ఆర్ డీ, పీఎఫ్ అకౌంట్ ఇంకా మరిన్ని ఆర్థిక లావాదేవీలు కొనసాగించే చోట మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్చడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాకుండా కాపాడుకోవచ్చు.

Thanks for reading Changes from April 1 : ఏప్రిల్ 1 నుంచి ఇవి ఇక చెల్లవు

No comments:

Post a Comment