రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లకు పదోన్నతులు
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు ముఖ్య కార్యదర్శులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పించారు.
రాష్ట్రంలో కొందరు సీనియర్ ఐఎఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్య కార్యదర్శులుగా ఉన్న ఐదుగురు అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు. 1988 బ్యాచ్కు చెందిన ఐఎఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మితో పాటు 1991 బ్యాచ్కు చెందిన జి. సాయిప్రసాద్, అజయ్ జైన్, రామ్ ప్రకాశ్ సిసోడియా, సుమితా దావ్రాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ నుంచి అనుమతి వచ్చాకే వై. శ్రీలక్ష్మికి శాశ్వతంగా పదోన్నతి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సుమితా దావ్రాకు కూడా ప్రోఫార్మా ప్రాతిపదికను అనుసరించి పదోన్నతి వర్తిస్తుందని స్పష్టం చేసింది.విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారికి కూడా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. ఆమెకు డీఐజీ హోదా కల్పిస్తూ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు ఇచ్చారు.
Thanks for reading The government has issued orders granting promotions to several IAS officers in the state.
No comments:
Post a Comment