Highlights of the high-level meeting with CM Jagan, ministers and officials.
ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఉచితం
అమరావతి: కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఖర్చుతోనే ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 18-45 ఏళ్ల మధ్య వారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. వీరందరికి ఏపీ సర్కార్ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనుంది
రేపట్నుంచి నైట్ కర్ఫ్యూ
AP : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ అత్యవసర సేవలు మినహా మిగిలినవి ఏవీ పని చేయవు. దుకాణాలు, ప్రజా రవాణా, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసి వేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆళ్లనాని తెలిపారు. కర్ఫ్యూ నుంచి ఫార్మసీలు, ల్యాబ్లు, మీడియా, పెట్రోల్ బంక్లు, శీతల గిడ్డంగులు, గోదాములు, అత్యవసర సర్వీసులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వైద్యం కోసం
వీఆర్డీఎల్ ల్యాబ్లలో కొవిడ్ పరీక్షలుఅనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ మేరకు వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబోరేటరీ (వీఆర్డీఎల్)ల ద్వారా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. మూడు దశల్లో ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కరోనా పరీక్షల నిర్వహణకు 533మంది సిబ్బందిని నియమించగా.. ఇప్పుడు కొత్తగా మరో 110 టెక్నికల్ మెడికల్ సిబ్బందిని నియమిస్తున్నట్లు ఆళ్లనాని తెలిపారు. ప్రతి వీఆర్డీఎల్ కేంద్రంలో పరీక్షలు చేసేందుకు రీసెర్చర్తో పాటు రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటాఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్తులను భర్తీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం రోజూ 40వేల వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. కొత్తగా సిబ్బందిని నియమించడం ద్వారా నిత్యం 60వేలకుపైగా కొవిడ్ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ట్రూనాట్ యంత్రాల ద్వారా గతంలో రోజుకి 10వేల పరీక్షలు నిర్వహించామని.. మరో మూడు రోజుల్లో ట్రూనాట్ పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీలో కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.
పరీక్షల నిర్వహణపై కీలక నిర్ణయం
ఏపీలో టెన్ , ఇంటర్ పరీక్షల నిర్వహణపై సమీక్ష సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది . విద్యార్థులకు నష్టం కలగకుండా టెన్ , ఇంటర్ , డిగ్రీ , ఇంజినీరింగ్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు . కరోనా నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలన్న సీఎం .. కరోనా నేపథ్యంలో వార్డుల్లో ప్రత్యేక మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
Thanks for reading Highlights of the high-level meeting with CM Jagan, ministers and officials.
No comments:
Post a Comment