Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, April 26, 2021

New restrictions on AP from tomorrow


రేపట్నుంచి AP లో కొత్త ఆంక్షలు 

ఏవేడుకైనా 50 మందికే అనుమతి :రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనికుమార్‌ సింఘాల్

అమరావతి: కరోనా విలయతాండవం చేస్తున్న వేళ మహమ్మారి నివారణకు ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇకపై రాష్ట్రంలో ఏ వేడుకకైనా 50 మందికే అనుమతిస్తామని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. క్రీడా ప్రాంగణాలు, జిమ్‌లు, ఈతకొలనులను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. 50 శాతం సామర్థ్యంతోనే ప్రజా రవాణా, సినిమాహాళ్లకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.


అన్ని కార్యాలయాల్లో 50 గజాల దూరం పాటించాలని సింఘాల్‌ కోరారు. ఒకే కాల్‌సెంటర్‌ ద్వారా ఆస్పత్రుల్లో పడకల కేటాయింపు, అడ్మిషన్లు జరగాలన్నారు. ‘‘రెమ్‌డెసివిర్‌ పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 11వేల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రానికి 341 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించింది. కానీ, అది సరిపోవడం లేదు. మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగాన్ని పర్యవేక్షిస్తాం. చాలా చోట్ల ఆక్సిజన్‌ వృథా అవుతోంది. అవసరం లేకపోయినా ఆక్సిజన్‌ వాడుతున్నారు’’ అని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాకు వివరించారు.

Thanks for reading New restrictions on AP from tomorrow

No comments:

Post a Comment