Partial Curfew from day after tomorrow
AP: ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ
అమరావతి: ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంపై కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఉ.6 నుంచి మ.12 వరకే దుకాణాలకు అనుమతిచ్చారు. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. కొవిడ్ నియంత్రణపై సీఎం జగన్ మంత్రులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని వివరించారు. కొవిడ్ నివారణ చర్యలతో పాటు ఆస్పత్రుల్లో బెడ్లు పెంచాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు ఆయన వివరించారు. నిర్ణీత సమయాల్లో కర్ఫ్యూ విధించాలని సూచించారన్నారు.
Thanks for reading Partial Curfew from day after tomorrow
No comments:
Post a Comment