ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కనీస ఉత్తీర్ణత మార్కులు.. విద్యార్థులు , వారి తల్లిదండ్రుల సందేహాలకు ప్రకటన విడుదల చేసిన ఇంటర్ బోర్డు కార్యదర్శి..
అమరావతి : కరోనా కారణంగా రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫస్టియర్ విద్యార్థులందరినీ కనీస ఉత్తీర్ణత మార్కు లు ( మినిమం పాస్ మార్కులు ) తో సెకండియర్ ( 2021-22 ) లోకి ప్రమోట్ చేస్తున్నట్లు ఇంటర్మీడి యెట్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు . ఇటీవల ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులు , వారి తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవు తున్న సందేహాలను నివృత్తి చేస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు .
రెగ్యులర్ సెకండియర్ ( 2020-210 ) పూర్తి చేసిన విద్యార్థులకు ...
● ఐపీఈ మార్చి 2021 కు పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు .. వారి మార్కులు ( ఫస్టియర్ , సెకం డియర్ ) మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించకుండా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు .
● ప్రాక్టికల్ మార్కులను పెంచుకోవడానికి మాత్రం అవకాశం లేదు .
●ఐపీఈ - మార్చి 2021 / అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు .
●ప్రైవేటు విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించి హాజరుకావచ్చు .
●హాజరు మినహాయింపు కేటగిరీలోని విద్యార్థు లు కూడా ఈ పరీక్షలకు ఫీజు చెల్లించి హాజరు కావాలి . .
●విద్యార్థులంతా నైతిక విలువలు ( ఎథిక్స్ ) , మానవ ( హ్యూమన్ వ్యాల్యూస్ ) , పర్యావరణ విద్య ( ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకే షన్ పరీక్షల్లో ) క్వాలిఫై అవ్వాలి . అలా కాని వారు ఈ పరీక్షలకు ఫీజు చెల్లించి తమ సుముఖతను తెలపాలి .
●ప్రాక్టికల్ పరీక్షల్లో తప్పిన , గైర్హాజరు అయిన వారు పరీక్ష ఫీజు చెల్లించి ప్రాక్టికలకు హాజరు కావాల్సి ఉంటుంది .
రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులకు ..
◆ 2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్ లో చేరి ఐపీఈ - మార్చి 2021 పరీ క్షలకు ఫీజు చెల్లించిన వారందరూ కనీస ఉత్తీర్ణత మార్కులతో సెకండియర్ లోకి ప్రమోషన్
◆ కనీస ఉత్తీర్ణత మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించాలనుకునే విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఒకటి లేదా అన్ని సబ్జెక్టుల పరీక్షలను రాయొచ్చు . ఈ పరీక్షలకు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవ సరం లేదు .
◆ఈ పరీక్షలకు హాజరుకాని అభ్యర్థులకు వారికి ఇచ్చిన కనీస ఉత్తీర్ణత మార్కులనే కొనసాగిస్తారు .
◆ ఐపీఈ -2021 పరీక్షలకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఫీజు చెల్లించి అడ్వాన్స్ సప్లి మెంటరీ పరీక్షలకు హాజరుకావాలి .
Schedule for Supplementary Exams Here
Thanks for reading Minimum passing marks for Intermediate 1st year students
No comments:
Post a Comment