12- 14 ఏళ్ల వారికి టీకాలు మార్చి నుంచి
కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డా.NK అరోడా వెల్లడి
దిల్లీ: భారత్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలై నిన్నటితో ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. తొలుత ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వారియర్స్తో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని..
నేడు 15 ఏళ్లు, ఆపై వారందరి కోసం విస్తరించారు. ఇదే క్రమంలో దేశంలో 12 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేసే ప్రక్రియ మార్చిలో ప్రారంభించే అవకాశం ఉందని నేషనల్ టెక్నికల్ ఆడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్టీఏజీఐ)కి చెందిన కొవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోడా సోమవారం తెలిపారు. అప్పటివరకు 15-18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జనవరి 3న 15-18 ఏళ్లలోపు వారికి టీకాలు వేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది ఈ వయస్సు బాలబాలికలు మొదటి డోస్ వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం ట్వీట్ చేశారు. మరోవైపు 60 ఏళ్లు పైబడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రికాషన్ డోసుల పంపిణీ కొనసాగుతోంది.
Thanks for reading Vaccines for 12- to 14-year-olds have been revealed since March by Kovid Working Group Chairman Dr NK Aroda
No comments:
Post a Comment