Andhra News: అక్టోబరు 1నుంచి వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా
అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మరి కొన్ని పథకాలు అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు అక్టోబరు 1 నుంచి వైఎస్సార్ కల్యాణ మస్తు, షాదీ తోఫా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసింది.
ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు 98.44శాతం హామీలు అమలు చేశామని ఈ సందర్భంగా సీఎం జగన్ వెల్లడించారు. పేద ఆడపిల్లలున్న కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. పేద ఆడపిల్లకు గౌరవంగా పెళ్లి చేసేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, భవన కార్మికుల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు. వైఎస్సార్ కల్యాణమస్తు ద్వారా ఎస్సీలకు రూ.1లక్ష, ఎస్సీల కులాంతర వివాహాలకు రూ.1.2లక్షలు, బీసీలకు రూ.50వేలు, బీసీల కులాంతర వివాహాలకు రూ.75వేలు, విభిన్న ప్రతిభావంతుల వివాహాలకు రూ.1.50లక్షలు, భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు రూ.40వేలు, షాదీ తోఫా కింద మైనార్టీల వివాహాలకు రూ.1లక్ష, ఆర్థిక సాయం అందించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పథకాలకు సంబంధించి పూర్తివివరాలు లభిస్తాయని జీవోలో పేర్కొన్నారు.
Thanks for reading Andhra Pradesh: Marriage assistance scheme from October 1
No comments:
Post a Comment