Diwali recharge plans: జియోలో 75జీబీ అదనపు డేటా.. వీఐలో ఉచిత ఇంటర్నెట్!
దీపావళి సందర్భంగా వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో తమ ప్రీపెయిడ్ యూజర్ల కోసం ప్రత్యేర రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి.
దీపావళి సందర్భంగా ప్రముఖ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్లలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ‘దీపావళి సెలబ్రేషన్ ఆఫర్’ పేరిట జియో తమ 4జీ వినియోగదారులకు దీన్ని అందిస్తోంది. మరి ఈ ఆఫర్లలో ఉన్న ప్రత్యేక ప్రయోజనాలేంటో చూద్దాం..
జియో ఆఫర్..
ఇంటర్నెట్ డేటా, వాయిస్ కాలింగ్, ఎసెమ్మెస్లతో పాటు ఈ ప్రత్యేక ఆఫర్లో జియో తమ వినియోగదారులకు పలు అదనపు ప్రయోజనాలను కల్పిస్తోంది. ఈ ప్రత్యేక ప్లాన్ ధరను రూ.2,999గా నిర్ణయించారు. వ్యాలిడిటీ 365 రోజులు. రోజుకు 2.5 జీబీ చొప్పున మొత్తం ఏడాదంతా కలిపి 912 జీబీ డేటా లభిస్తుంది. ఈ దీపావళి ప్రత్యేక ఆఫర్లో భాగంగా అదనంగా 75 జీబీ డేటాను అందిస్తోంది. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్ యాప్ల సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. వీటితో పాటు ఫెర్న్స్ అండ్ పెటల్స్లో షాపింగ్ చేసే రూ.150, ఇక్సిగో ద్వారా ఫ్లైట్ బుక్ చేస్తే రూ.750, అజియోలో రూ.1,000, అర్బన్ ల్యాడర్లో రూ.1,500, రిలయన్స్ డిజిటల్లో కొనుగోళ్లు చేస్తే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.
వొడాఫోన్-ఐడియా ఆఫర్..
దీపావళి ప్రత్యేక ఆఫర్లో భాగంగా వీఐ రెండు రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. అక్టోబరు 31 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. రూ.1,449తో రీఛార్జి చేస్తే.. అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎసెమ్మెస్లు వస్తాయి. దీని కాలపరిమితి 180 రోజులు. రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీనికి 50 జీబీ డేటా అదనం. అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య ఉచితంగా ఇంటర్నెట్ను వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. పైగా వీకెండ్ డేటా రోల్ఓవర్ కూడా ఉంది.
ఈ పండుగ సందర్భంగా రూ.2,899తో వీఐ మరో ప్లాన్ను కూడా ఆవిష్కరించింది. దీంట్లో రూ.1,499 ప్లాన్లో లభించిన అన్ని ప్రయోజనాలు ఉంటాయి. అయితే, 50జీబీ అదనపు డేటాకు బదులు 75 జీబీ డేటా లభిస్తుంది. అలాగే దీని కాలపరిమితి 365 రోజులు.
Thanks for reading Diwali recharge plans
No comments:
Post a Comment