Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 15, 2022

Odisha: Regularization of 57 thousand contract employees..


 Odisha: 57వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. తీపి కబురు చెప్పిన సీఎం

ఒడిశాలో 57వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తన పుట్టినరోజు నాడు సీఎం  నవీన్‌ పట్నాయక్‌ తీపి కబురు వినిపించారు.

 ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 57వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్లు ప్రకటించింది. తన 76 పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఈ ప్రకటన చేయడం విశేషం. అయితే, ఇకపై కాంట్రాక్టు నియామకాలను రద్దు చేయనున్నట్లు కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నవారిని క్రమబద్ధీకరించనున్నామని, ఆపై ఈ విధానంలో భర్తీ ప్రక్రియను నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నోటిఫికేషన్‌ను ఆదివారం విడుదల చేయనున్నట్లు పట్నాయక్ వీడియో సందేశంలో తెలిపారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ.1300 కోట్ల అదనపు భారం పడనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Thanks for reading Odisha: Regularization of 57 thousand contract employees..

No comments:

Post a Comment