TSPSC: తెలంగాణలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలైంది. 9,168 పోస్టులు గ్రూప్-4 ద్వారా భర్తీ చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలైంది. 9,168 పోస్టులు గ్రూప్-4 ద్వారా భర్తీ చేయనున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈనెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
గ్రూప్-4 విభాగంలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4లో మరో 4 రకాల పోస్టులను ప్రభుత్వం చేర్చింది. ఈమేరకు గతంలో ఇచ్చిన ఉత్వర్వులను ఇటీవలే సాధారణ పరిపాలన శాఖ సవరించింది. గ్రూప్-4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సూపర్ వైజర్ మేల్, జువైనల్ సర్వీసెస్ మ్యాట్రన్ స్టోర్ కీపర్, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్ పోస్టులు చేర్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజాగా టీఎఎస్పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-4 నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్ పోస్టులు భారీగా ఉన్నాయి.
శాఖల వారీగా పోస్టుల వివరాలు..
* పట్టణాభివృధ్ధి, పురపాలిక విభాగంలో 2,701 పోస్టులు.
* రెవెన్యూ శాఖలో 2,077 పోస్టులు.
* పంచాయతీరాజ్ శాఖలో 1,245 పోస్టులు.
* ఉన్నత విద్యాశాఖలో 742 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
Thanks for reading TSPSC: Group-4 notification released in Telangana
No comments:
Post a Comment