AP Cabinet meeting Highlights @ 16.10.24

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ముఖ్యంగా ప్రభుత్వ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చ జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్ లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు, చెత్త పన్ను రద్దు, ఆలయాల పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, నూతన పారిశ్రామిక విధానం, కొత్త మున్సిపాలిటీలలో పోస్టుల భర్తీ వంటి అంశాలపై చర్చించారు.
ఏపీ క్లీన్ ఎనర్జీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0కి ఆమోద ముద్ర వేసింది. 20లక్షాల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీని రూపొందించారు. ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా పాలసీ తీసుకొచ్చారు. నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2030 నాటికి ఇంటింటికీ పారిశ్రామికవేత్త అంశంతో ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చింది. మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
• ఏపీ క్లీన్ ఎనర్జీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
• 2024- 29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0కు ఆమోదం తెలిపింది.
• 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీని రూపొందించారు. ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా పాలసీని తీసుకువచ్చారు.
• ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చ సాగుతోంది.
• నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
• 2030 నాటికి ఇంటింటికీ పారిశ్రామికవేత్త అంశంతో ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకువచ్చింది.
• ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ప్రోత్సహించేలా కొత్త పాలసీపై చర్చ సాగింది.
• మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూకేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
• డ్రగ్స్ నియంత్రణ, ధరల నియంత్రణపై మంత్రుల కమిటీల నియామకంపై చర్చ సాగుతోంది.
• ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ నియామకంపైనా చర్చిస్తున్నారు.
• అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.
• చెత్తపన్ను రద్దుపైనా క్యాబినెట్ తీర్మానం చేయనుంది. #APCabinet
Thanks for reading AP Cabinet meeting Highlights @ 16.10.24
No comments:
Post a Comment