CM Instructions to Officers at Education Review Meeting
పాఠశాలలకు ఆహ్లాదకర రంగులు
➪ సచివాలయాల ఇంజనీర్లకు నాడు -నేడు పనుల సందర్శన : కొత్త బాధ్యతలు
➪ అమరావతి: మన బడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న ప్రభుత్వం, స్కూల్ భవనాలన్నింటికీ కొత్తగా పెయింటింగ్స్ వేయిస్తోంది.
➪ ఆ రంగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు.
➪ ఆ మేరకు పలు రంగుల నమూనాలను అధికారులు సమావేశంలో ప్రజెంటేషన్ రూపంలో సీఎంకు చూపారు.
➪ ఈ కార్యక్రమానికి జగన్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ చినవీరభద్రుడితో పాటు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
➪ స్కూల్ బిల్డింగ్లకు వేసే రంగులు ఆహ్లాదకరంగా ఉండాలని, అక్కడ ఓ పండగ వాతావరణం కనిపించాలని సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
➪ పిల్లలకు అన్ని విషయాలపై తగిన అవగాహన కలిగేలా స్కూల్ గోడలపై చక్కగా బొమ్మలు కూడా గీయాలని సూచించారు.
➪ ప్రజాధనం వృధాకాకుండా వర్షాకాలం తర్వాత ఆ పనులు చేపట్టి, వేగంగా పూర్తి చేయాలని చెప్పారు.
➪ మరోవైపు మన బడి నాడు-నేడు రెండు, మూడో దశ పనులకు అవసరమయ్యే రుణ సేకరణ ప్రక్రియను మొదలుపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
➪ మన బడి నాడు-నేడులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రూ.2 వేల కోట్ల రూపాయల పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎంకు నివేదించారు.
➪ పలు చోట్ల దాతలకు అప్పజెప్పిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు.
➪ దీంతో దాతలను వెంటనే ఆయా బాధ్యతల నుంచి తప్పించి, జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సీఎం ఆదేశించారు.
➪ సచివాలయాల ఇంజనీర్లకు కొత్త బాధ్యతలు
➪ గ్రామ సచివాలయాల ఇంజనీర్లు మన బడి నాడు-నేడు పనులను కూడా చూడాలని, వారు ప్రతిరోజూ తప్పనిసరిగా స్కూళ్లను సందర్శించాలని సీఎం జగన్ సూచించారు.
➪ వారానికి ఒకసారి పనులపై నివేదిక అందజేయాలని ఆదేశించారు.
➪ స్కూళ్లకు సంబంధించిన మెజర్మెంట్ బుక్(ఎంబీ)లో రికార్డింగ్ అధికారాన్ని కూడా సచివాలయ ఇంజనీర్లకు ఇవ్వాలని, ఆ మేరకు నిబంధనలకు రూపకల్పన చేయాలని పెద్దాఫీసర్లకు సూచించారు.
Thanks for reading CM Instructions to Officers at Education Review Meeting
No comments:
Post a Comment