Selected students in KGBVs must report by the 4th september
కేజీబీవీలలో ఎంపికైన విద్యార్థినులు 4 లోగా రిపోర్టు చేయాలి.
రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ 2020- 21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలు తరగతులు మిగిలిన సీట్ల భర్తీ కోసం అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేశారు ఆదివారం ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు కె. వెట్రిసెల్వి ఒక ప్రకటన విడుదల చేశారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నా మన్నారు. ఆగస్టు 25 తో ఆరో తరగతిలో ప్రవేశాలకు, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేశారని, ఎంపికైన విద్యార్థులకు మొబైల్ ఫోన్లు సమాచారం పంపించినట్లు తెలిపారు. ఆగస్టు 31వ తేదీ సోమవారం నుంచి సెప్టెంబర్ 4 వరకు సంబంధిత కేజీబీవీల్లో ప్రత్యే అధికారులకు రిపోర్ట్ చేయాలని సూచించారు.విద్యార్థినులు తమతోపాటు రేషన్ కార్డు, ఆధార్ బదిలీ, స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకు వెళ్లాలని పేర్కొన్నా రు. ఎంపికైన విద్యార్థులకు వివరాలు వెబ్సైట్లో, పాఠశాలల నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించడం జరుగుతోందన్నారు. సందేహాల నివృత్తి కోసం 9441270099 నంబర్లలో సంప్రదించాలని ఎస్పీడీ కె. వెట్రిసెల్వి సూచించారు.
Thanks for reading Selected students in KGBVs must report by the 4th september
No comments:
Post a Comment