PM Kisan: రేపే రైతుల ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ సొమ్ము
దేశంలో ఉన్న 2.7 లక్షల ఎరువుల చిల్లర దుకాణాలను దశలవారీగా వన్స్టాప్ సెంటర్లుగా మార్చి వాటికి ‘పీఎం సమృద్ధి కేంద్రాలు’గా నామకరణం చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు.
దేశంలో ఉన్న 2.7 లక్షల ఎరువుల చిల్లర దుకాణాలను దశలవారీగా వన్స్టాప్ సెంటర్లుగా మార్చి వాటికి ‘పీఎం సమృద్ధి కేంద్రాలు’గా నామకరణం చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, భూసార పరీక్ష సౌకర్యాలు, అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల గురించి సమాచారాన్ని వీటిల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 17న దిల్లీలో జరిగే కార్యక్రమంలో అగ్రి స్టార్టప్ సదస్సు/ ఎగ్జిబిషన్ను, 600 ‘పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాల’ను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు. సుమారు 300 అంకుర పరిశ్రమలు తమ నవకల్పనలను ప్రదర్శిస్తాయన్నారు. రైతులకు ‘పీఎం సమ్మాన్ నిధి’ 12వ విడత కింద రూ.16వేల కోట్లను ప్రధాని విడుదల చేయనున్నారనీ, ఇప్పటివరకు రూ.2.16 లక్షల కోట్లు విడుదల చేసినట్లవుతుందని తెలిపారు. ‘ఒకే దేశం ఒకే ఎరువు’ ఇతివృత్తంతో భారత్ యూరియా, భారత్ డీఏపీ, భారత్ ఎంఓపీ, భారత్ ఎన్పీకే బస్తాలను మోదీ విడుదల చేస్తారన్నారు. వీటన్నింటినీ భారత్ పేరుతో విడుదల చేయడంవల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయన్నారు.
Official website
Click here to Check Beneficiary Status
Click Here to Download PM Kisan Samman Nidhi App
PM Kisan Samman Nidhi Latest Beneficiary List - Check Here
Thanks for reading PM Kisan: రేపే రైతుల ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ సొమ్ము
No comments:
Post a Comment