AP TET: నేడు ఏపీ టెట్ ఫలితాలు
‣ 2.35లక్షల మంది పరీక్షకు హాజరు
అమరావతి: ఏపీ టెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఫలితాలు ఎన్ని గంటలకు విడుదల చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ నిర్వహించారు. 2.35లక్షల మంది దీనికి హాజరయ్యారు. ఫలితాలు మార్చి 14నే విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా వెల్లడించలేదు. టెట్లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు ఎంతో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ఫలితాల లింక్ కోసం క్లిక్ చేయండి
Thanks for reading AP TET: AP TET Results Today
No comments:
Post a Comment