Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, March 30, 2021

March 31 Deadline - These are the new rules


 మార్చి 31 డెడ్ లైన్- కొత్త రూల్స్ ఇవే....

మార్చి 31.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి రోజు. ఏప్రిల్​ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన పనులకు బుధవారమే తుది గడువు. ఈలోపు కచ్చితంగా పూర్తి చేయాల్సిన పనులేంటి? ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులు.. ధరలు పెరిగే వస్తువులు ఏవి? అనే వివరాలు మీకోసం.

బుధవారంతో(మార్చి 31) 2020-21 ఆర్థిక సంవత్సరం పూర్తై.. గురువారం నుంచి (ఏప్రిల్​ 1) 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త బడ్జెట్ ప్రతిపాదనలు అదే రోజు నుంచి అమల్లోకి రానున్న తరుణంలో.. ఆర్థికపరమైన అంశాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆవి ఏటంటే..

ఆధార్​ పాన్​ లింక్​ తప్పనిసరి..ఆధార్​తో పాన్​ కార్డ్​ లింక్ చేసేందుకు మార్చి 31ని చివరి తేదీగా నిర్ణయించింది ప్రభుత్వం. గడువు లోపు లింక్ చేసుకోకపోతే వారికి రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశముంది.

ఆధార్‌, పాన్​ లింక్​ లేకుంటే ....click here


పన్ను ఆదా పెట్టుబడులకు చివరి తేదీ..2020-21కి సంబంధించి పన్ను ఆదా పెట్టుబడులకు కూడా మార్చి31తోనే తుది గడువు. పన్ను చెల్లింపుల్లో రాయితీలు దక్కాలంటే ఈ లోపే మదుపు చేయాలి.

పన్ను ఆదాకు.. ఫండ్ల మార్గం..click here


కొత్త ఐటీ రూల్స్​..బడ్జెట్​ ప్రసంగంలో 2021-22కి సంబంధించి కొత్త ఆదాయపు పన్ను చెల్లింపు నిబంధనలను ప్రతిపాదించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఇవి ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి.

ఐటీ కొత్త రూల్స్.. గురువారం నుంచే అమలు....click here


ఆ బ్యాంకుల చెక్కులు చెల్లవు..ముఖ్యంగా గత రెండేళ్లలో ఇతర బ్యాంకుల్లో విలీనమైన బ్యాంక్​ల చెక్​బుక్​లు, పాస్​బుక్​లు నిరుపయోగంగా మారనున్నాయి. ఆయా బ్యాంకుల ఐఎఫ్​ఎస్​సీ, ఎంఐసీఆర్​ కోడ్​లూ మారనున్నాయి. వెంటనే చెక్​బుక్​లు, పాస్​బుక్​లు మార్చుకోవాలని బ్యాంకులు.. ఇప్పటికే వినియోగదారులకు సమాచారమిచ్చాయి.

ఏప్రిల్ 1 నుంచి ఆ చెక్​బుక్​లు చెల్లవ్!....click here


ఆటో డెబిట్​కు ఆర్​బీఐ కొత్త రూల్స్..ఆటో డెబిట్​కు సంబంధించి కొత్త రూల్స్​ తీసుకొచ్చింది ఆర్​బీఐ. ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలతో ఇకపై రూ.5000 కంటే ఎక్కువ మొత్తంలో ఆటో డెబిట్​ కావాలంటే.. ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి.


ధరలు పెరిగేవి.. తగ్గేవి..2021-22 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి పలు వస్తు, సేవల ధరల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. టీవీలు, ఏసీలు వంటివి మరింత ప్రియం కానున్నాయి. వ్యవసాయ, దిగుమతి చేసుకున్న వైద్య ఉపకరణాల ధరలు కాస్త తగ్గనున్నాయి.

ఏప్రిల్ 1 నుంచి ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..click here

Thanks for reading March 31 Deadline - These are the new rules

No comments:

Post a Comment