తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ శ్రీకృష్ణ దేవాలయాలు (Famous Krishna Temples In Telugu States)
శ్రీకృష్ణాష్టమి రోజు.. గోపాలుడి దేవాలయాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతారు. గీతాపఠనం, ఉట్టి కొట్టడం, గ్రామోత్సవం లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయితే శ్రీకృష్ణ, వేణుగోపాలస్వామి దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనూ చారిత్రక ప్రాధాన్యమున్న దేవాలయాలు కొన్ని ఉన్నాయి. వీలుంటే వాటిని ఓ సారి సందర్శించండి.
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, తిరుపతి ( Sri Venkateswara Swami Temple, Tirupati)
కలియుగ ప్రత్యక్షదైవంగా భావించే వేంకటేశ్వరుని సన్నిధానంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వేంకటేశ్వరుని సన్నిధిలో ఉన్న గోపాల కృష్ణుని విగ్రహాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఉట్ల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకను చూడటానికి భక్తులు ఈ రోజున పెద్ద ఎత్తున తిరుపతికి తరలి వస్తారు.
మీసాల కృష్ణ దేవాలయం, పులిదిండి (Krishna Temple, Pulidindi)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆత్రేయపురం మండలంలోని.. పులిదిండి గ్రామంలో మీసాల కృష్ణుడు కొలువు దీరి ఉన్నాడు. అఖండ గోదావరి వశిష్ఠ, గౌతమీ పాయలుగా విడవడిన ప్రాంతంలో ఈ క్షేత్రం ఉంది. సాధారణంగా కృష్ణుడి విగ్రహాలకు మీసాలుండవు. కానీ పులిదిండి క్షేత్రంలో మాత్రం మీసాలుంటాయి. అందుకే ఈ కృష్ణుణ్ని మీసాల కృష్ణుడు అని పిలుస్తారు. రాజమండ్రి నగరానికి 27 కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే రాజమండ్రి నుంచి రోడ్డుమార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.
శ్రీకృష్ణ దేవాలయం, నాంపల్లి (Sri Krishna Temple, Nampally)
హైదరాబాద్ నగర నడిబొడ్డున శ్రీకృష్ణ దేవాలయం ఉంది. నాంపల్లిలో ఉన్న ఈ దేవాలయం ఇస్కాన్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇక్కడ కూడా కృష్ణాష్టమి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.
వేణుగోపాలస్వామి దేవాలయం, హంసలదీవి ( Venugopalaswamy Temple, Hansala Devi)
కృష్ణా జిల్లా హంసలదీవిలోని వేణుగోపాల స్వామి దేవాలయానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ వేణుగోపాలుడు రుక్మిణీ. సత్యభామ సమేతుడై పూజలందుకుంటున్నాడు.
వేణుగోపాలస్వామి దేవాలయం, మొవ్వ (Venugopalaswamy Temple, Movva)
కృష్ణా జిల్లాలో కూచిపూడి సమీపంలో మొవ్వ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో కొలువు దీరిన వేణుగోపాల స్వామి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. స్వామి చేతిలో వేణువు గాలి వూదే రంధ్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే స్వామి వారి విగ్రహానికున్న మకరతోరణంలో దశావతరాలుంటాయి. క్షేత్రయ్య రాసిన పదాలన్నీ ఈ మువ్వ గోపాలుని మీదే. విజయవాడ నుంచి 50 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది.
శ్రీకృష్ణ దేవాలయం, బహదూర్ పుర ( Sri Krishna Temple, Bahadurpura)
హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్కి చేరువలో ఉందీ దేవాలయం. 150 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి.
వేణుగోపాల స్వామి దేవాలయం, ఏదులాబాద్ ( Venugopala Swamy Temple, Edulabad)
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్కు సమీపంలో ఉన్న ఈ దేవాలయంలో వేణుగోపాలస్వామి రుక్మిణీ, సత్యభామ సమేతుడై కొలువుదీరాడు. ప్రాచీన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో స్వామి స్వయంభూగా వెలిశాడని భక్తులు విశ్వసిస్తారు.
వారిజల వేణుగోపాలస్వామి దేవాలయం, గోపలాయపల్లె ( Warijala Venugopalaswamy Temple, Gopalaayapalle)
నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి రెండు కి.మీ దూరంలో ఉంది ఈ క్షేత్రం. హైదరాబాద్ – విజయవాడ హైవేకు అతి సమీపంలో ఉంటుంది. గోపలాయపల్లెలో కృష్ణుడు కొలువుదీరిన గుట్టను గోవర్థన గిరి అని పిలుస్తారు. ఈ గుట్ట మీద ఉన్న వారిజల చెట్టు కింద ఓ పుట్ట ఉండేదట. ఆ పుట్టలో వెలసిన బాల కృష్ణుడు కాబట్టి.. ఈ క్షేత్రం వారిజల వేణుగోపాల స్వామి క్షేత్రంగా పేరుపొందింది. ఈ క్షేత్రంలో కృష్ణాష్టమికి విశేష ఉత్సవాలు జరుగుతాయి.
వేణుగోపాల స్వామి దేవాలయం, నేలకొండపల్లి (Venugopala Swami Temple, Nelakkondapalli)
ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఉన్న ఈ దేవాలయం చాలా ప్రాచీనమైనది. ఈ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది.
శ్రీ కృష్ణ జననం (Sri Krishna Birth Secret)
శ్రీకృష్ణ లీలామృతం (Sri Krishna Leelamrutham)
శ్రీకృష్ణాష్టమి విశిష్టత (Krishna Janmashtami In Telugu – Significance)
కృష్ణాష్టమి పూజా విధానం (Pooja process)
కృష్ణాష్టమి వ్రతం విధి విధానాలు (Sri Krishnastami Vrata Importance)
శ్రీకృష్ణాష్టమి నైవేద్యాలు (Prasada Nivedana)
ఉట్టి కొట్టడం (Significance of Utti(Dahi Handi)
కృష్ణాష్టమి సందేశాలు (Janmashtami Quotes In Telugu)
Thanks for reading తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ శ్రీకృష్ణ దేవాలయాలు (Famous Krishna Temples In Telugu States)
No comments:
Post a Comment