కృష్ణాష్టమి వ్రతం విధి విధానాలు (Sri Krishnastami Vrata Importance)
కృష్ణుడంటేనే బాలతత్వం. బాల కృష్ణుడు పుట్టిన కృష్ణాష్టమి రోజు.. కృష్ణాష్టమి వ్రతం చేయడం హిందూ సంప్రదాయంలో ఉంది. సాధారణంగా శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం ఎక్కువగా చేస్తుంటారు. వాటితో సమానమైన ప్రాధాన్యం కృష్ణాష్టమి వ్రతానికి సైతం ఉంది. అష్టమీ తిథి రోహిణీ నక్షత్రం అర్థరాత్రి సమయంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ వ్రతాన్ని చేస్తారు.
ఆ రోజు ప్రతి తల్లి తనను తాను యశోదగా భావించుకుని.. పగలంతా కటిక ఉపవాసం ఉండాలి. కృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్టుగా పాదముద్రలు వేసుకోవాలి. అర్థ్రరాత్రి వేళ కృష్ణుడు పుడుతున్నాడనే సమయం ఆసన్నమైనప్పుడు కాయం పంచిపెడతారు. కాయం అంటే బాలింతలకు పెట్టే కారం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో కట్టెకారం అని కూడా పిల్లుస్తారు. కాల్చిన శొంఠితో దీన్నితయారు చేస్తారు. ఆ తర్వాత ఆ కాయాన్నే కొంచెం తింటారు.
ఆ రోజు వారికి అదే ఆహారం. మరునాడు ఉదయం కృష్ణుడికి పూజ చేసిన తర్వాత పదిమందికీ భోజనాలు పెట్టి ఆ తర్వాత భోజనం చేస్తారు. అలాగే పిల్లలు ఇష్టంగా తినే ఆహార పదార్థాలైన జంతికలు, చేగోడీలు, పాలముంజెలు.. వంటివి యథాశక్తి తయారు చేసి పిల్లలకు పంచిపెడతారు.
శ్రీ కృష్ణ జననం (Sri Krishna Birth Secret)
శ్రీకృష్ణ లీలామృతం (Sri Krishna Leelamrutham)
శ్రీకృష్ణాష్టమి విశిష్టత (Krishna Janmashtami In Telugu – Significance)
కృష్ణాష్టమి పూజా విధానం (Pooja process)
శ్రీకృష్ణాష్టమి నైవేద్యాలు (Prasada Nivedana)
ఉట్టి కొట్టడం (Significance of Utti(Dahi Handi)
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ శ్రీకృష్ణ దేవాలయాలు (Famous Krishna Temples In Telugu States)
కృష్ణాష్టమి సందేశాలు (Janmashtami Quotes In Telugu)
Thanks for reading కృష్ణాష్టమి వ్రతం విధి విధానాలు (Sri Krishnastami Vrata Importance)
No comments:
Post a Comment